‘ఆరోగ్య సేతు’ తప్పనిసరిగా వాడాలని కేంద్రం చెప్పడం చట్టవిరుద్ధం: జస్టిస్ శ్రీకృష్ణ

  • ‘ఆరోగ్య సేతు’ను తప్పనిసరిగా వాడాలన్న కేంద్రం
  • చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ యాప్ ను తప్పనిసరి చేస్తున్నారు?
  • ఇప్పటి వరకూ ఏ చట్టమూ ఈ యాప్ ను సమర్థించట్లేదు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా తమ మొబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ లేకుండా ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం తరచుగా ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటనలపై సుప్రీంకోర్టు మాజీ జడ్డి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ స్పందించారు.

ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వాడాలని కేంద్రం చెప్పడం చట్టవిరుద్ధమని అన్నారు. చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ యాప్ ను తప్పనిసరి చేస్తున్నారు? అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఏ చట్టమూ ఈ యాప్ ను సమర్థించట్లేదని స్పష్టం చేశారు. మొబైల్స్ లో ఈ యాప్ లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 వరకు జరిమానా విధిస్తామని నోయిడా పోలీసులు ఆదేశించారని, ఇది చట్ట వ్యతిరేకం అని, ఇలాంటి ఆదేశాలను కోర్టుల్లో సవాలు చెయ్యవచ్చని అన్నారు.

Aaarogya seth
AAP
central government
Justice Sri Krishna

More Telugu News